ఊయల మెడకు చుట్టుకోవడంతో ఊపిరాడక బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన కుమురంభీం జిల్లా చింతలమానెపల్లి మండలంలోని దిందా గ్రామంలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన డగే నారాయణ, లక్ష్మి దంపతుల కుమారుడు అంజన్న(11).. ఇంట్లో చీరతో కట్టిన ఊయలపై మంగళవారం ఊగుతూ ఆడుకుంటుండగా కుటుంబసభ్యులు ఇంటిబయట చెట్టుకింద ఉన్నారు. వారు వచ్చి చూసేసరికి చీర మెలితిరిగి మెడకు చుట్టుకొని బాలుడు అపస్మారక స్థితిలో ఉండటంతో ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు.