దుబాయ్లో ఉంటున్న తెలుగు వ్యక్తి జాక్ పాట్ కొట్టాడు. తాను చేసిన పొదుపుతో ఏకంగా రూ.2.25 కోట్లు గెలుచుకున్నారు. సేవింగ్స్ స్కీమ్ చందాదారులకు లక్కీ డ్రా నిర్వహించగా.. అందులో అతడు విజేతగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన బోరుగడ్డ నాగేంద్రమ్ 2017లో యూఏఈ వెళ్లారు. దుబాయ్లో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న ఆయన లక్కీ డ్రాలో రూ.2.25 కోట్లు గెలుపొందాడు.