కుళ్లిపోయిన కూరగాయలతో ఆహార పదార్థాలు, చట్నీస్‌ రెస్టారెంట్‌పై కేసు నమోదు

52చూసినవారు
కుళ్లిపోయిన కూరగాయలతో ఆహార పదార్థాలు, చట్నీస్‌ రెస్టారెంట్‌పై కేసు నమోదు
TG: హైదరాబాద్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. శనివారం కొండాపూర్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా శరత్‌ సిటీ మాల్‌‌లోని చట్నీస్‌ రెస్టారెంట్‌లో దాడులు చేశారు. అక్కడ కందిపప్పు డ్రమ్ములో బొద్దింకలు.. ఉల్లిగడ్డలు, క్యాబేజీలు పూర్తిగా కుల్లిపోయి కనిపించాయి. అపరిశుభ్రమైన వాతావరణంలో కుళ్లిపోయిన కూరగాయలతో ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో రెస్టారెంట్‌ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్