పశ్చిమ బెంగాల్‌లో నర్సుపై వేధింపులకు పాల్పడ్డ పేషెంట్

77చూసినవారు
పశ్చిమ బెంగాల్‌లో నర్సుపై వేధింపులకు పాల్పడ్డ పేషెంట్
పశ్చిమ బెంగాల్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. బీర్భూమ్‌ జిల్లాలోని ఇలంబజార్ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో శనివారం రాత్రి డ్యూటీలో ఉన్న నర్సుపై ఓ వ్యక్తి వేధింపులకు పాల్పడ్డాడు. తీవ్ర జ్వరం కారణంగా ఆరోగ్య కేంద్రానికి వచ్చిన వ్యక్తికి సెలైన్ డ్రిప్ వేస్తుండగా నర్సుపై లైంగిక వేధింపులకు యత్నించాడని నర్సు ఆరోపించింది. దీంతో ఆసుపత్రి అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్