రైలు పట్టాలపై ఇరుక్కుపోయిన రిక్షా.. రిక్షావాలా ఏం చేశాడంటే(వీడియో)

54చూసినవారు
రైలు పట్టాల మధ్య ఒక రిక్షా ఇరుక్కుపోవడంతో ఆ రిక్షా కార్మికుడు తన ప్రాణాలను రిస్క్ లో పెట్టాడు. ఈ ఘటన బంగ్లాదేశ్‌ లో జరిగినట్లు తెలుస్తోంది. ఓ రిక్షావాలా తన రిక్షాతో రైలు పట్టాలు దాటుతున్న క్రమంలో రిక్షా టైర్‌ రైలు పట్టాల మధ్య ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేదు. అదే సమయంలో ఆ పట్టాలపై రైలు వేగంగా దూసుకువస్తోంది. కానీ, అతడు రిక్షాను వదలకుండా అలాగే పట్టుకొని ఉన్నాడు. జీవనోపాధికి ఆధారమైన రిక్షాను కాపాడుకునేందుకు ఆ కార్మికుడు చేసిన పనికి నెట్టింట భిన్నంగా స్పందిస్తున్నారు.

ట్యాగ్స్ :