ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురుదెబ్బ

70చూసినవారు
ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురుదెబ్బ
ఐపీఎల్-17లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గాయానికి చికిత్స కోసం స్వదేశానికి వెళ్లిపోయాడు. అతను ఈ నెల 3న కోల్‌కతాతో చివరి మ్యాచ్ ఆడాడు. కాగా ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ కేవలం రెండు మ్యాచుల్లో గెలుపొందింది. 4 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది. ఇక ఆ జట్టు ఈ నెల 17న గుజరాత్‌తో తలపడనుంది.