నిమిషం లేట్ అవ్వడంతో పరీక్షకు దూరమైన విద్యార్థిని (వీడియో)

596చూసినవారు
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే పరీక్షా కేంద్రానికి ఓ విద్యార్థిని నిమిషం ఆలస్యం రావడంతో పరీక్ష రాసే అవకాశం కోల్పోయింది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పావనికి ధర్మపురిలో సెంటర్ కేటాయించారు. ఉ.9 గంటల్లోపు పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉండగా పావని 9.09 గంటలకు వచ్చింది. దీంతో అధికారులు ఆమెను వెనక్కి పంపారు. పరీక్ష రాసే అవకాశం కోల్పోవడంతో పావని కంటతడి పెట్టింది.