తల్లడిల్లిన తల్లి మనసు.. హృదయవిదారక ఘటన

80చూసినవారు
తల్లడిల్లిన తల్లి మనసు.. హృదయవిదారక ఘటన
ఏపీలోని అన్నమయ్య జిల్లా రాజంపేటలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో కొడుకు శ్యామ్ (5) మృతి చెందాడు. దాంతో తల్లి శిరీష తల్లడిల్లిపోయింది. ఆస్పత్రిలో మృతదేహం పక్కనే పడుకుని అతడితో మాట్లాడుతూ ఉండిపోయింది. ‘కన్నయ్య.. లే కన్నయ్య.. ఎంతసేపు పడుకుంటావు.. నిద్రలే’ అంటూ కలవరించడం అందరినీ కలిచివేసింది. ఈ హృదయవిదారక ఘటనను చూసి స్థానికులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్