మద్యం మత్తులో నడిరోడ్డుపై కుర్చీలో కూర్చున్న వ్యక్తిని ఢీకొట్టిన ట్రక్

72చూసినవారు
ఉత్తరప్రదేశ్ లో ఓ వ్యక్తి మద్యం మత్తులో నడిరోడ్డుపై కుర్చీలో కూర్చోగా ఓ ట్రక్ ఢీకొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రతాప్ గఢ్ లో అజయ్ అనే వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించి జోరు వానలో నడిరోడ్డుపై కుర్చీలో కూర్చున్నాడు. అతడిని గమనించి కొన్ని వాహనాలు పక్కకు తప్పుకుని వెళ్లాయి. కానీ ఓ ట్రక్ డ్రైవర్ మాత్రం అతడిని ఢీకొట్టి వెళ్లిపోయాడు. పోలీసులు సదరు మందుబాబును అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్