నటి జత్వానీ కేసు.. ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీకి ఊరట

66చూసినవారు
నటి జత్వానీ కేసు.. ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీకి ఊరట
నటి కాదంబరీ జెత్వానీ కేసులో ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీకి హైకోర్టులో ఊరట లభించింది. అక్టోబర్ 1 వరకు ఆయనపై చర్యలు తీసుకోవద్దని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఆ రోజుకి వాయిదా వేసింది. కాగా దర్యాప్తు పేరుతో తనను వేధించారని నటి జెత్వానీ.. ఐపీఎస్‌ గున్నీతో పాటు మరో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటాపై ఫిర్యాదు చేసింది. దాంతో వారు విచారణ ఎదుర్కొంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్