హైదరాబాద్, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి బయల్దేరే, రాష్ట్రం మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లకు అదనపు హాల్టులు ఇస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ నిర్ణయం నేటినుంచి అమల్లోకి రానుంది. దక్షిణ ఎక్స్ప్రెస్ జమ్మికుంట స్టేషన్లో, హజ్రత్ నిజాముద్దీన్ గరీబ్రథ్ ఎక్స్ప్రెస్ వరంగల్, పెద్దపల్లి స్టేషన్లలో ఆగనుంది. ఇలా మరిన్ని రైళ్లకు అదనపు హాల్టులు ఇచ్చారు. ఈ నిర్ణయం 6 నెలల పాటు అమల్లో ఉంటుందని ద.మ.రైల్వే తెలిపింది.