మున్సిపల్ వైస్ చైర్మన్ బీజేపీ నాయకుడికి మధ్య ఘర్షణ

4356చూసినవారు
ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని, బీజేపీ నాయకుడు గండ్రత్ మహేందర్ కు మధ్య జరిగిన గొడవ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గొడవ పడ్డ వీడియో వైరల్ గా మారింది. ఆదిలాబాద్ పట్టణంలోని చిలుకూరి లక్ష్మీ నగర్ కాలనీలో వైస్ చైర్మన్ జహీర్ రంజాని ప్రభుత్వ భూములను కబ్జా చేస్తూ అక్రమంగా మున్సిపల్ నుండి ఇంటి నంబర్లు ఇప్పిస్తున్నాడని ఆరోపిస్తూ.. కౌన్సిలర్ కుమారుడు, బిజెపి నాయకులు గండ్రత్ మహేందర్ సోమవారం మున్సిపల్ కార్యాలయనికి వివరాలు సేకరించేందుకు వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న వైస్ చైర్మన్ అక్కడికి వచ్చి మహేందర్ తో వాగ్వాదానికి దిగారు. అంతే దీటుగా మహేందర్ సైతం వైస్ చైర్మన్ తో వాగ్వాదానికి దిగారు. ముందుగా మున్సిపల్ నుండి వెల్లిపోవాలి అంటూ వైస్ ఛైర్మన్ అనడంతో నువ్వేవరు నన్ను వెళ్లిపొమ్మంటానికి అంటూ దిటుగానే బదులిచ్చాడు. దీంతో ఇరువురి మధ్య కాసేపు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వివాదాన్ని అక్కడే ఉన్నవారెవరో ఫోన్ లో వీడియో తీసారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సంబంధిత పోస్ట్