జిల్లాను కుష్టు రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్ పేర్కొన్నారు. కుష్టవ్యాధి గ్రస్తుల గుర్తింపు ఉద్యమము సర్వేను సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని చిలుకూరి లక్ష్మీనగర్ లో ఆయన ప్రారంభించారు. ఇంటింటికి తిరుగుతూ వ్యాధిపై అవగాహన కల్పిస్తూ సర్వే చేపట్టారు. శరీరంపై పోలిపోయిన రాగి రంగు గల మొద్దుబారిన మచ్చలు ఉంటే కుష్టువ్యాధిగా అనుమానించాలని సూచించారు.