విద్యార్థులు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి

55చూసినవారు
బేల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారుచేసిన ప్రయోగాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానోపాధ్యాయుడు కోల నర్సింలు మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు శాస్త్ర సాంకేతిక అంశాలలో సైతం రాణించాలన్నారు. తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకోవాలని విద్యార్థులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్