దేశానికి గాంధీ సిద్ధాంతంతో కూడిన పరిపాలన కావాల్సిన అవసరముందని జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి సీతక్క అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని రత్నా గార్డెన్ లో ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తో కలిసి హాజరయ్యారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.