నామినేషన్ల స్వీకరణ నేపథ్యంలో భారీ బందోబస్తు

1075చూసినవారు
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నేటి నుండి నామినేషన్ల సేకరణ ప్రారంభమైంది. ఇందులో భాగంగా అదిలాబాద్ కలెక్టరేట్ పరిసరాల వద్ద పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్ స్వీకరించనున్నారు. అభ్యర్థుల నామినేషన్ సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం ప్రజలకు చేరవేసేందుకు మీడియా సెంటర్ ను సైతం ఏర్పాటు చేశారు.