కాంట్రాక్ట్ కార్మికులకు పదివేలు బోనస్ చెల్లించాలి

53చూసినవారు
కాంట్రాక్ట్ కార్మికులకు పదివేలు బోనస్ చెల్లించాలి
సింగరేణి సంస్థలో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరికీ లాభాల వాటా పదివేలు చెల్లించాలని ఎఫ్ టీయు నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బెల్లంపల్లిలోని సివిక్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. అనంతరం సింగరేణి సూపర్వైజర్ కు వినతి పత్రం అందించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ నెల 30న హైదరాబాదులో జరిగే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్