ఊరంతా ఖాళీ.. ఎందుకంటే?
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం గోవింద్ పూర్ గ్రామంలో 40 ఆదివాసీ గిరజన కుటుంబాలు అంటే 200 మంది జనాభా ఉన్నారు. వారికి తాగునీటి వసతి సరిగ్గా లేకపోవడంతో గ్రామంలోని రెండు చేతి పంపులతో పాటు బావుల నీటినే తాగుతున్నారు. అయితే గడిచిన మూడేళ్లలో వరుసగా కిడ్నీ సంబంధిత సమస్యతో మరణాలు సంభవిస్తుండటంతో వారిలో ఆందోళన మొదలైంది. దీంతో గ్రామస్థులు ఊరిని వదిలి వెళ్లిపోయారు.