జిల్లా అడవుల్లో అరుదైన పక్షి ప్రత్యక్షం

66చూసినవారు
జిల్లా అడవుల్లో అరుదైన పక్షి ప్రత్యక్షం
ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో అరుదైన పక్షి దర్శనం ఇచ్చింది. తలమడుగు మండలం కోసాయి గ్రామ సమీప అడవుల్లో పొన్నంకి పిట్ట సోమవారం వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లింగంపల్లి కృష్ణ కెమెరాకు చిక్కింది. హిమాలయాల అడవులు, మధ్య పశ్చిమ భారత దేశంలోని కొండలలో ఎక్కువగా ఉండే ఈ పక్షి జిల్లా అడవుల్లో ప్రత్యక్షమైంది. ఇది తొమ్మిది రంగుల్లో ఉంటుంది. తెల్లవారుజమున, సంధ్యాసమయంలో వినసొంపైన రెండు శబ్దాలను చేస్తుంది.

సంబంధిత పోస్ట్