వివరాలను సక్రమంగా నమోదు చేయాలి
![వివరాలను సక్రమంగా నమోదు చేయాలి](https://media.getlokalapp.com/cache/ca/2a/ca2a1c9804a2477740bf534f2110b20d.webp)
ఇచ్చోడ మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువులు, విత్తనాల గిడ్డంగిని కలెక్టర్ రాజార్షిషా మంగళవారం తనిఖీ చేశారు. రిజిష్టర్, బిల్ రశీదులను, నిల్వ ఉన్న ఎరువుల బ్యాగులను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకుని ప్రతీ రోజూ బిల్ రిపోర్టు లో రైతుల వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. అనంతరం మిషన్ భగీరథ ఇంటింటి నల్లా కనెక్షన్ల సర్వే మొబైల్ ఆప్ ను పరిశీలించి ఇంటింటి సర్వే త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.