ద్విచక్ర వాహనం అదుపు తప్పి వ్యక్తి మృతి

58చూసినవారు
ద్విచక్ర వాహనం అదుపు తప్పి వ్యక్తి మృతి
కోటపల్లి మండలానికి చెందిన సైదుల సాగర్ (28) ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడడంతో మృతి చెందినట్లు ఎస్సై రాజేందర్ తెలిపారు. కోటపల్లి నుంచి శెట్ పల్లికి వెళ్లిన సాగర్ తిరుగు ప్రయాణంలో కోటపల్లికి వస్తుండగా బైక్ అదుపు తప్పి కింద పడడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్ లో చెన్నూరు దవాఖానకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్