

చెన్నూరులో 'పుష్ప-2' థియేటర్ అద్దాలు ధ్వంసం (వీడియో)
పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా ఫ్యాన్స్ కొన్ని చోట్ల దాడులకు పాల్పడుతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో గురువారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. శ్రీనివాస థియేటర్ అద్దాలను అభిమానులు ధ్వంసం చేశారు. సినిమా ప్రదర్శించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. తమ అభిమాన నటుడు అల్లు అర్జున్ నటించిన సినిమాను ఎందుకు ప్రదర్శించడం లేదని మండిపడ్డారు.