పురుగుల మందు తాగి యువకుడు సూసైడ్

22737చూసినవారు
పురుగుల మందు తాగి యువకుడు సూసైడ్
పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తానూర్ మండలం బోల్సాలో జరిగింది. భోసి గ్రామానికి చెందిన గంగాధర్ ఈ నెల 12న భైంసాకు వెళ్తానని చెప్పి ఇంట్లోంచి వెళ్లాడు. బోల్సా శివారు ప్రాంతంలో అతడి మృత దేహాన్ని స్థానిక రైతులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తల్లి లక్ష్మిబాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :