అనారోగ్యంతో విసిగిపోయి ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం కౌట్ల(బి) గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అలగొండ విజయలక్ష్మి(20) బీడీ కార్మికురాలిగా పనిచేసేది. గత ఆరేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో విసుగుచెందిన ఆమె ఇంట్లో దూలానికి చున్నీతో ఉరేసుకొని చనిపోయినట్లు S1 చంద్రమోహన్ తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.