టీ20 ప్రపంచకప్లో భాగంగా సూపర్-8 మ్యాచ్లో ఆసీస్పై గెలిచి భారత్ సెమీస్ చేరింది. ఈ మ్యాచ్లో అక్షర్ పటేల్ ఒంటి చేత్తో ఒక క్యాచ్ అందుకున్నాడు. కుల్దీప్ వేసిన 9వ ఓవర్ చివరి బంతికి మిచెల్ భారీ షాట్ కొట్టగా.. బౌండరీ వద్ద ఉన్న అక్షర్ గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో ఒడిసి పట్టాడు. దీంతో స్టేడియంలోని ఆటగాళ్లు, ప్రేక్షకులు షాక్ అయ్యారు.