పలు శాఖలకు మంత్రులు లేరని వస్తున్న విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పారు. గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. 'పలు శాఖలకు మంత్రులు లేరని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని శాఖలకు మంత్రులున్నారు. విద్యాశాఖ నా వద్దే ఉంది. పీసీసీ అధ్యక్షుడిగా నా పదవీ కాలం ముగియబోతోంది. పదవీ కాలం పూర్తయ్యేలోగా అధ్యక్షుడిని నియమించాలని కోరాను. త్వరలోనే కొత్త పీసీసీ చీఫ్ నియామకం ఉంటుంది. పీసీసీ అధ్యక్షుడిగా మంచి విజయాలు సాధించాను' అన్నారు.