అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్(మెదడును తినే అమీబా) అనే అరుదైన వ్యాధి బారిన పడి కేరళలో మృదుల్(14) అనే బాలుడు మృతి చెందాడు. కలుషిత జలాల్లో ఉండే ఈ బాక్టీరియా ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించినపుడు ఈ వ్యాధి సోకుతుంది. బాలుడు కోజికోడ్లోని ఓ కొలనులో ఇటీవల దిగాడని అధికారులు తెలిపారు. కాగా ఈ ఏడాది మే, జూన్ నెలల్లో ఈ భయంకర వ్యాధి బారిన పడి ఇద్దరు బాలికలు మరణించారు. 2017, 23లో అలప్పుళ జిల్లాలో ఈ కేసులు నమోదయ్యాయి.