కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య

56చూసినవారు
కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య
రాజస్థాన్‌లోని కోటాలో మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌ మథురలోని బర్సానాకు చెందిన పరశురామ్‌(21) నీట్‌ పరీక్షకు సిద్ధమయ్యేందుకు వారం క్రితమే కోటాకు వచ్చాడు. బుధవారం తన రూంలో ఉరి వేసుకుని చనిపోయాడు. పరశురామ్‌ కనిపించకపోవడంతో ఇంటి యజమాని అనూప్ కుమార్ రాత్రి 11 గంటల ప్రాంతంలో పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి చూడగా పరశురామ్ మృతదేహం కనిపించింది. కాగా, కోటాలో ఈ ఏడాదే 13 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్