AP: ప్రైవేట్ వర్సిటీల సవరణ బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అమరావతిలో బిట్స్ ప్రాంగణం ఏర్పాటు కోసం 70 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. డీప్ టెక్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు చేస్తున్నామని, విశాఖలో AI, స్పోర్ట్ వర్సిటీలు ఏర్పాటు చేస్తామని అన్నారు. 2016లో ప్రైవేట్ వర్సిటీల బిల్లు తెచ్చామని, లోపాలను సరిదిద్ది కొత్త చట్టాలు తెస్తామని పేర్కొన్నారు.