కొంత మొత్తంలో డబ్బులు రాగానే ఆన్లైన్ బెట్టింగ్, రమ్మీ వంటి ఆటలు మంచి ఆదాయ మార్గమని భావిస్తున్నారు. కూర్చున్న చోటే రోజూ వేలకువేలు సంపాదించవచ్చనుకుంటూ ఉచ్చులో పడుతున్నారు. కొద్దిపాటి లాభాలు చూసిన తర్వాత అసలు 'ఆట' మొదలవుతుంది. కొద్దిపాటి లాభాలు ఇస్తూ.. వీలైనంత దోచుకునేలా ప్రోగ్రామింగ్ చేసి ఉంటాయి. దీనిపై అవగాహన లేక యువత, రిటైరైన ఉద్యోగులు, పెద్దవాళ్లు కూడా దీనికి బానిపై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.