సునీతా విలయమ్స్ తిరుగు ప్రయాణం మొదలు

59చూసినవారు
సునీతా విలయమ్స్ తిరుగు ప్రయాణం మొదలు
అంతరిక్ష కేంద్రం నుంచి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ల తిరుగు ప్రయాణం ప్రారంభమైంది. భారత కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం 8.15 గంటలకు హ్యాచ్‌ మూసివేత ప్రక్రియ జరిగింది. 10.15 గంటలకు అన్‌డాకింగ్‌ ప్రక్రియ మొదలైంది.  ఆ త్వరాత క్రూ డ్రాగన్‌ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోయింది. దీంతో వారి ప్రయాణం భూమ్మీదకి ప్రారంభమైంది. బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగుతుంది.