మసీదుపై ఇజ్రాయిల్‌ బాంబులతో దాడి.. 21 మంది మృతి

62చూసినవారు
మసీదుపై ఇజ్రాయిల్‌ బాంబులతో దాడి.. 21 మంది మృతి
గాజా స్ట్రిప్లోని ఒక మసీదుపై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన బాంబు దాడుల్లో 21 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. డీర్ అల్ -బలాహ్ ప్రాంతంలోని షుహాదా అల్-అక్సా హాస్పిటల్ సమీపంలో ఉన్న మసీదుపై ఇజ్రాయెల్ బాంబు దాడులకు దిగింది. నిరాశ్రయులైన పాలస్తీనియన్లు ఆ మసీదులో తలదాచుకున్నట్లు సమాచారం. హమాస్ కమాండ్ అండ్ కంట్రోల్ కాంప్లెక్స్గా ఆ మసీదును వినియోగిస్తున్నారని పేర్కొన్న ఇజ్రాయెల్ సైన్యం బాంబులతో విరుచుకుపడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్