తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా తిరుచెందూర్ సమీపంలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. రద్దీగా ఉండే పరమన్కురిచ్చి బజార్ ప్రాంతంలో ఓ స్వీట్ షాపు వద్ద ఎప్పటిలాగే కస్టమర్లు అధికంగా ఉన్నారు. ఆ సమయంలో ఓ ఆటో అదుపు తప్పి వేగంగా దూసుకొచ్చింది. స్వీట్ షాపు వద్ద నిల్చున్న కస్టమర్లను ఢీకొట్టింది. అనంతరం ఆటో బోల్తా పడింది. కస్టమర్లతో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న వారు ఈ ప్రమాదంలో గాయపడ్డారు.