AP: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరులో మోదకొండమ్మ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ తెల్లవారుజామున మన్యం దేవతగా విరాజిల్లుతున్న మోదకొండమ్మ అమ్మవారి విగ్రహం, పాదాలను ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రతిష్టించారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు జరగనుండగా.. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. ఈ క్రమంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.