లోక్సభ ఎన్నికల ముందు పశ్చిమబెంగాల్లోని అధికార టీఎంసీకి ఎదురుదెబ్బ తగిలింది. టీఎంసీ అభ్యర్థి భార్య బీజేపీలో చేరి షాక్ ఇచ్చారు. నాడియా జిల్లా రాణాఘాట్ స్థానానికి మే 13న లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఆ స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా ముకుట్ మణి అధికారి బరిలో నిలిచారు. కాగా.. ఆయన భార్య స్వస్తిక మహేశ్వరి శనివారం కాషాయ కండువా కప్పుకున్నారు.