దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సోషల్ మీడియా సహా వివిధ ప్లాట్ఫామ్లను విస్తృతంగా వినియోగిస్తున్నాయి. ఈ క్రమంలోనే అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి ఎన్నికలకు ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లతో ప్రచారాన్ని నిర్వహిస్తోంది. మ్యూజిక్ నుంచి దేశ సంస్కృతి, ఫిట్నెస్, ఫ్యాషన్ వరకు వివిధ రంగాల్లో అత్యంత ప్రభావితం చేయగల సోషల్ మీడియా స్టార్స్ను బీజేపీ తన ప్రచారానికి వాడుకుంటోంది.