రాహుల్‌పై ECకి బీజేపీ ఫిర్యాదు

76చూసినవారు
రాహుల్‌పై ECకి బీజేపీ ఫిర్యాదు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఎన్నికల సంఘం (EC)కి బీజేపీ బుధవారం ఫిర్యాదు చేసింది. మోడీ ప్రభుత్వం సైనికుల్లో రెండు కేటగిరీలను సృష్టించిందని, అందులో ఒకటి రిజర్వ్‌డ్ తరగతులకు చెందిన పేద కుటుంబాలు, మరొకటి సంపన్న కుటుంబాలకు చెందిన వారు అని రాహుల్ వ్యాఖ్యానించినట్లు బీజేపీ ఆరోపించింది. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ECకి ఫిర్యాదు చేసిన వారిలో కేంద్ర మంత్రులు జైశంకర్, అర్జున్ మేఘ్వాల్ ఉన్నారు.