అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న 4 రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ఛార్జ్లను బీజేపీ సోమవారం నియమించింది. కేంద్రమంత్రులు, రెండు రాష్ట్రాల సీఎంలకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. జమ్మూకశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జ్గా బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, హర్యానాకు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బిప్లవ్ దేవ్, మహారాష్ట్రకు అశ్వినీ వైష్ణవ్, భూపేంద్రయాదవ్, జార్ఖండ్కు శివరాజ్ సింగ్ చౌహన్, హిమంత బిశ్వ శర్మలను బీజేపీ నియమించింది.