ఉత్తరప్రదేశ్ లోని ఘోర ప్రమాదం జరిగింది. శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జిపై మినీ లారీ వెళ్తుండగా ఒక్కసారిగా స్లాబ్ కూలడంతో ట్రక్కు వంతెన కింద పడిపోయింది. వంతెన కూలిపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శిథిలావస్థకు చేరిన వంతెనపై ప్రభుత్వం ట్రాఫిక్ను మూసివేయలేదు. ఈ వంతెన మీదుగా ప్రతిరోజు వేలాది మంది ప్రయాణిస్తుంటారు. ట్రాఫిక్ నిలిచిపోయి ఉంటే భారీ ప్రమాదం జరిగేదని స్థానికులు పేర్కొన్నారు.