బీఆర్ఎస్ నేత, పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఫేక్ నోటీసులు ప్రచారం చేశారని మన్నె క్రిశాంక్పై ఓయూ అధికారులు వర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై ఐపీసీ 466, 468, 505(1) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ కేసులో క్రిశాంక్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు.