ఉపాధ్యాయురాలు దారుణ హత్య

655180చూసినవారు
ఉపాధ్యాయురాలు దారుణ హత్య
మేలుకోటె ఎస్‌ఈటీ పబ్లిక్‌ పాఠశాలలో పని చేస్తున్న దీపిక అనే ఉపాధ్యాయురాలు హత్యకు గురయ్యారు. గత శనివారం తరగతులు ముగించుకున్న ఆమె.. ఎంతకీ ఇంటికి రాకపోవడంతో మాణిక్యనహళ్లికి చెందిన ఈమె భర్త లోకేశ్‌ మేలుకోటె పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో యోగ నరసింహ స్వామి బెట్ట దిగువన ఖాళీ స్థలంలో ఆమె మృతదేహాన్ని హంతకులు పూడ్చి పెట్టారని ఎస్పీ యతీశ్ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందన్నారు.