ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ పునరుద్ధరణ

52చూసినవారు
ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ పునరుద్ధరణ
విజయవాడ డివిజన్‌లో ఆధునికీకరణ పనుల కారణంగా రద్దు చేసిన రైళ్లలో కొన్నింటిని దక్షిణ మధ్య రైల్వే పునరుద్ధరించింది. జన్మభూమి, విజయవాడ- కాకినాడ పోర్ట్‌ రైళ్లను ప్రయాణికులకు మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చింది. నిడదవోలు-కడియం మధ్య ఆధునికీకరణ పనుల కారణంగా జూన్‌ 23 నుంచి ఆగస్టు 11 వరకు పలు రైళ్లను ఇటీవల రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రయాణికుల నుంచి ఆందోళన వ్యక్తమైంది. దీంతో జన్మభూమిని యథావిధిగా నడపనున్నట్లు ప్రకటించింది.

సంబంధిత పోస్ట్