జయ జయ హే తెలంగాణ పాట ఉద్యమాన్ని ఉద్ధృతం చేసిందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. జయ జయహే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా చేయాలని నిర్ణయించామన్నారు. ఆస్కార్ గ్రహీత కీరవాణి ఆంధ్రావారని ప్రచారం చేయడం దారుణమని అన్నారు. యాదాద్రి ఆర్కిటెక్గా ఆంధ్రా వ్యక్తిని పెట్టలేదా? రాష్ట్రానికి సంబంధంలేని వాళ్లను బ్రాండ్ అంబాసిడర్లుగా చేయలేదా? అని ప్రశ్నించారు.