తమిళనాడులోని హోసూరు ప్రాంతంలో కొత్తిమీర ధర ఆకాశాన్నంటింది. కట్ట ఏకంగా రూ.100 పలుకుతోంది. శూలగిరి, రాయకోట, తళి, అంచెట్టి, బాగలూరు, బేరికై, డెంకణీకోటతో సహ వివిధ ప్రాంతాల నుంచి హోసూరు, శూలగిరి రాయకోట సహా మార్కెట్లకు కొత్తిమీర సరఫరా భారీగా తగ్గింది. దీంతో రూ.90 నుంచి రూ.100 వరకు పలుకుతోంది. పంట దెబ్బతినడమే ధర పెరగడానికి కారణమని తెలుస్తోంది.