CBSE టెన్త్, ప్లస్ టూ పరీక్షలను 2025 నుంచి ఏడాదిలో 2 సార్లు నిర్వహించేందుకు కేంద్రం సిద్ధం అవుతోంది. దీనిపై ప్రణాళికలు సిద్ధం చేయాలని CBSEని కేంద్ర విద్యా శాఖ కోరినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రిన్సిపాళ్లతో మే నెలలో సంప్రదింపులు జరిపేందుకు కసరత్తు చేస్తున్నారు. జాతీయ నూతన విద్యా విధానానికి అనుగుణంగా CBSEలో సెమిస్టర్ విధానాన్ని ఇస్రో మాజీ ఛైర్మన్ కె.కస్తూరిరంగన్ సారథ్యంలోని కమిటీ ప్రతిపాదించింది.