CCTV: మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లిన దుండగులు

571చూసినవారు
యూపీలోని కాన్పూర్‌లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళ పూజకు వెళ్లి వస్తుండగా.. ఇద్దరు దుండగులు బైకుపై వెళ్తూ మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లారు. దీంతో ఆమె అరుస్తూ పరిగెత్తినా కూడా ఫలితం లేకుండా పోయింది. దుండగులు బైక్ నెంబర్ ప్లేట్ తీసేసి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన గురువారం జరిగినట్లు తెలుస్తోంది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది..