కేరళలో ఇటీవల వెలుగులోకి వచ్చిన నిపా వైరస్ కారణంగా 14 ఏళ్ల బాలుడు మరణించాడు. దీంతో కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. వెంటనే కాంటాక్ట్ ట్రేసింగ్ చేసి బాలుడిని కలిసిన వారందరి నమూనాలు సేకరించాలని సూచించింది. వారిని క్వారంటైన కు తరలించాలని ఆదేశించింది. ఈ వైరస్ వ్యాప్తిపై ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.