కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్

5878చూసినవారు
కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్
రేపటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఉజ్వల లబ్ధిదారులకు శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 1న ఈ పథకం కింద అర్హులైన వారికి రూ. 300 సబ్సిడీని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. ఫలితంగా 2024-2025 ఆర్థిక సంవత్సరానికి LPG సిలిండర్ ధర రూ.300 తగ్గుతుంది. ఈ పథకం కింద లబ్ధిదారులు ఏడాదికి 12 సిలిండర్లు పొందవచ్చు.