ఏపీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ఆఫీస్ సాఫ్ట్వేర్ సాయంతో కార్యకలాపాలు సాగిస్తున్నారు. అయితే ఈ-ఆఫీస్ సాఫ్ట్వేర్లో కొత్త వెర్షన్ను ఎన్ఐసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ చేయాలని అధికారులకు తెలిపింది. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ సరికాదని టీడీపీ అధినేత చంద్రబాబు ఈసీకి లేఖ రాశారు. దీనిపై స్పందించిన ఈసీ ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ను వాయిదా వేసింది.