ఢిల్లీ ఎయిర్‌పోర్టుపై కేంద్రం ఆంక్షలు

67చూసినవారు
ఢిల్లీ ఎయిర్‌పోర్టుపై కేంద్రం ఆంక్షలు
గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ కార్యకలాపాలపై కేంద్రం ఆంక్షలు విధించింది. భద్రతా కారణాల దృష్ట్యా జనవరి 26 వరకు ఉదయం 10.20 గంటల నుంచి 12.45 మధ్య టేకాఫ్, ల్యాండింగ్‌ను తాత్కాలికంగా రద్దు చేసింది. ఈ మేరకు శుక్రవారం విమానయాన సంస్థలకు నోటీసులు జారీ చేసింది. కాగా ఈ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.

ట్యాగ్స్ :